ప్రపంచ లెజెండరీ ఫుట్బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ రిటైర్మెంట్ గురించి పెద్ద ప్రకటన చేశాడు. ఖతార్ 2022 తన చివరి ప్రపంచకప్ అని ప్రకటించాడు. ప్రపంచ క్రీడారంగంలో ఈ వార్త సంచలనాన్ని రేకెత్తిస్తోంది. ప్రపంచ దిగ్గజ ఫుట్బాల్ క్రీడాకారుడు, అర్జెంటీనా లెజెండ్ “లియోనెల్ మెస్సీ’ ఇదే నా ఆఖరి ఆట అంటూ తన రిటైర్మెంట్ని గురించి ప్రకటించడమే అందుకు కారణం. 2022 ఖతార్లో జరిగే ఫిఫా ప్రపంచకప్ ఆటే తన చివరి ఆట అంటూ లియోనెల్ మెస్సీ సంచలన ప్రకటన చేశాడు. తాను శారీరకంగా బలంగానే ఉన్నా.. అదే తన ఆఖరి ఆట అని ప్రకటించాడు. 35 ఏళ్ళ అర్జెంటీనా ఫుట్బాల్ ఆటగాడు ఐదోసారి ప్రపంచకప్ పోటీల్లో పాల్గొనబోతున్నాడు. ఖతార్లో జరగబోయే ఫిఫా వరల్డ్కప్ మెస్సీ చిట్టచివ్వరి ఆటకాబోతోంది.
మెస్సీ ఓ ఇంటర్వులో మాట్లాడుతూ.. “నేను కొంచెం ఒత్తిడిలో ఉన్నాను. ప్రపంచకప్ వచ్చే వరకు నేను ఒకరోజు లెక్కపెట్టుకుంటున్నాను. నా కెరీర్లో ఇదే చివరి ప్రపంచకప్. కాబట్టి అది ఎలా పని చేస్తుందనేది ఆందోళన. నేను దాని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. చాలా ఉత్సాహంగా ఉన్నాను. ప్రపంచకప్లో అన్ని మ్యాచ్లు కఠినంగా ఉంటాయి. ఈసారి నా అభిమాన జట్టు గెలుస్తుందని చెప్పలేను. ఎందుకంటే ఈసారి మా కంటే మెరుగైన ప్రదర్శన చేస్తున్న జట్లు చాలా ఉన్నాయని నేను భావిస్తున్నాను.
మెస్సీ అంతర్జాతీయ కెరీర్ను పరిశీలిస్తే, అతను సమర్థవంతంగా రాణిస్తున్నాడు. అర్జెంటీనా తరఫున ఆడుతూ 90 గోల్స్ చేశాడు. బార్సిలోనా తరఫున మెస్సీ కూడా మంచి ప్రదర్శన చేశాడు. అతను 2004 నుండి 2021 వరకు ఈ జట్టు కోసం ఆడిన 520 మ్యాచ్లలో 474 గోల్స్ చేశాడు. అతను ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆటగాళ్లలో ఒకడి కొనసాగుతున్నాడు. లియోనెల్ మెస్సీ 2006, 2010, 2014, 2018 ప్రపంచ కప్ పోటీల్లో ఆడారు. 13 ఏళ్ల వయసులోనే ఫుట్బాల్ బరిలోకి దిగిన లియోనెల్ మెస్సీ, 2004లో బార్సిలోనా క్లబ్ లో సభ్యుడిగా చేరి కెరియర్ ప్రారంభించాడు.
2004-05 అర్జెంటీనా అండర్ 20 జట్టులో ఆడుతూ 14 గోల్స్ చేసి, చరిత్ర సృష్టించాడు. 2008లో అండర్ 20 జట్టు తరపున ఆడుతూ 2 గోల్స్, 2005 నుంచి అర్జెంటీనా సీనియర్ జట్టుకు ఆడుతూ 90 గోల్స్ చేశారు మెస్సీ. 2005 ఫిఫా వరల్డ్ యూత్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న మెస్సీ, అదే టోర్నీలో గోల్డెన్ బాల్ గోల్డెన్ షూను తొలిసారి కైవసం చేసుకున్నారు. 2008 ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించారు మెస్సీ.
మరిన్ని క్రీడా వార్తల కోసం