ముగిసిన ఐపీఎల్ వేలం.. కొనసాగిన విదేశీ క్రికెటర్ల హవా..

| Edited By:

Dec 20, 2019 | 4:10 AM

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2020 సీజన్‌ వేలం ముగిసింది. ఈసారి కోల్‌కతా వేదికగా జరిగిన వేలంలో.. ఆసీస్‌, ఇంగ్లండ్ ఆటగాళ్లపై కోట్ల రూపాయల వర్షం కురిసింది. అంతా ఊహించినట్లుగానే ఆసీస్‌ పేస్ బౌలర్ ప్యాట్‌ కమ్మిన్స్‌, మరో స్టార్‌ ఆటగాడు మ్యాక్స్‌వెల్‌లు వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయారు. కమ్మిన్స్‌కు రూ.15 కోట్లకు కోల్‌కతా దక్కించుకోగా.. మ్యాక్స్‌వెల్‌‌ను రూ. 10.5 కోట్లకు పంజాబ్ కొనుగోలు చేసింది. ఇక టీమిండియా యంగ్ క్రికెటర్స్ కూడా పర్వాలేదనిపించారు. అండర్ 19 క్రికెటర్ యశస్వి […]

ముగిసిన ఐపీఎల్ వేలం.. కొనసాగిన విదేశీ క్రికెటర్ల హవా..
Follow us on

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2020 సీజన్‌ వేలం ముగిసింది. ఈసారి కోల్‌కతా వేదికగా జరిగిన వేలంలో.. ఆసీస్‌, ఇంగ్లండ్ ఆటగాళ్లపై కోట్ల రూపాయల వర్షం కురిసింది. అంతా ఊహించినట్లుగానే ఆసీస్‌ పేస్ బౌలర్ ప్యాట్‌ కమ్మిన్స్‌, మరో స్టార్‌ ఆటగాడు మ్యాక్స్‌వెల్‌లు వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయారు. కమ్మిన్స్‌కు రూ.15 కోట్లకు కోల్‌కతా దక్కించుకోగా.. మ్యాక్స్‌వెల్‌‌ను రూ. 10.5 కోట్లకు పంజాబ్ కొనుగోలు చేసింది.

ఇక టీమిండియా యంగ్ క్రికెటర్స్ కూడా పర్వాలేదనిపించారు. అండర్ 19 క్రికెటర్ యశస్వి జైస్వాల్‌‌ను రూ. 2.40 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనగోలు చేయగా.. ప్రియాం గార్గ్‌ను రూ. 1.90 కోట్లకు సన్ రైజర్స్ హైదరబాద్ దక్కించుకుంది. మరోవైపు పీయూష్‌ చావ్లా వేలంలో దూసుకెళ్లాడు. చావ్లాను రూ. 6.75 కోట్లకు చెన్నె సూపర్‌ కింగ్స్‌ కొనుగోలు చేసింది. ఇక మరో క్రికెటర్ వరుణ్‌ చక్రవర్తిని.. రూ.4 కోట్లకు కేకేఆర్‌ కొనుగోలు చేసింది. విండీస్ హిట్టర్ హెట్‌మెయిర్‌ను రూ.7.75 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకుంది.

అత్యధికంగా అమ్ముడుపోయిన పలువురి ఆటగాళ్ల వివరాలు..

1. ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా)-ఐపీఎల్ జట్టు – కోల్‌కతా నైట్ రైడర్స్.. ధర- రూ.15.50 కోట్లు

2. గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) – ఐపీఎల్ జట్టు -పంజాబ్.. ధరరూ.10.75 కోట్లు

3. క్రిస్ మోరిస్ (సౌతాఫ్రికా), ఐపీఎల్ జట్టు- బెంగళూరు.. ధర -రూ .10 కోట్లు

4. షెల్డన్ కాట్రెల్ (వెస్టిండీస్), ఐపీఎల్ జట్టు – పంజాబ్..ధర- రూ.8.5 కోట్లు

5. నాథన్ కౌంటర్‌నైల్ (ఆస్ట్రేలియా), ఐపీఎల్ జట్టు- ముంబై.. ధరు – రూ.8 కోట్లు

6. పీయుష్ చావ్లా (ఇండియా ), ఐపీఎల్ జట్టు-చెన్నై… ధర – రూ.6.75 కోట్లు

7.సామ్ కర్రన్ (ఇంగ్లాండ్), ఐపీఎల్ జట్టు – చెన్నై- ధర- రూ.5.50 కోట్లు

 

 

8. రాబిన్ ఊతప్ప (ఇండియా), ఐపీఎల్ జట్టు -రాజస్థాన్.. ధర – రూ. 3 కోట్లు