భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మూడో టీ20కి ప్రేక్షకులు పూర్తి స్థాయిలో హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ 7 నుంచి న్యూసౌత్ వేల్స్ గవర్నమెంట్ కోవిడ్ నిబంధనల్లో సడలింపు ఇవ్వడమే ఇందుకు కారణం. కరోనా వ్యాప్తి కారణంగా వన్డే సిరీస్ మ్యాచ్లు చూసేందుకూ ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో పర్మిషన్ ఇవ్వలేదు. కానీ, డిసెంబర్ 7న సిడ్నీ వేదికగా జరిగే చివరి టీ20కి పూర్తి స్థాయిలో వీక్షకులు వచ్చేందుకు అనుమతి ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. వన్డే సిరీస్లో ఆస్ట్రేలియా 2-1 తేడాతో ఇండియా గెలిచింది. చివరి మ్యాచ్లో విజృంభించి..క్లీన్ స్వీప్ నుంచి తప్పించుకోగలిగింది. శుక్రవారం నుంచి టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి టీ20 మ్యాచ్ కాన్బెర్రాలోని మనుకా ఓవెల్ వేదికగా జరగనుంది.
Also Read : GHMC Election 2020: ఓల్డ్ మలక్పేటలో రీ పోలింగ్.. అంతా సిద్ధం చేసిన అధికారులు..!