కివీస్‌పై వరుసగా రెండో విజయం.. 2-0 తో భారత్ ఆధిక్యం!

| Edited By:

Jan 26, 2020 | 4:14 PM

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో మ్యాచ్ సొంతం చేసుకుంది. 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా..17. ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్(8), కోహ్లీ(11) త్వరగా పెవిలియన్ చేరినా.. లోకేశ్(56 నాటౌట్), శ్రేయాశ్ అయ్యర్(44) మ్యాచ్‌ను విజయ తీరాలకు చేర్చారు. శ్రేయాస్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన దూబే(8 నాటౌట్).. సిక్స్ కొట్టి మ్యాచ్ పూర్తి చేశాడు. కివీస్ బౌలర్లలో సౌథీ రెండు వికెట్లు, సోదీ […]

కివీస్‌పై వరుసగా రెండో విజయం.. 2-0 తో భారత్ ఆధిక్యం!
Follow us on

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో మ్యాచ్ సొంతం చేసుకుంది. 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా..17. ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్(8), కోహ్లీ(11) త్వరగా పెవిలియన్ చేరినా.. లోకేశ్(56 నాటౌట్), శ్రేయాశ్ అయ్యర్(44) మ్యాచ్‌ను విజయ తీరాలకు చేర్చారు. శ్రేయాస్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన దూబే(8 నాటౌట్).. సిక్స్ కొట్టి మ్యాచ్ పూర్తి చేశాడు. కివీస్ బౌలర్లలో సౌథీ రెండు వికెట్లు, సోదీ ఒక వికెట్ తీసుకున్నారు. న్యూజిలాండ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఆటగాళ్లలో మార్టిన్ గుప్తిల్ (33), కొలిన్ మన్రో(26), సీఫెర్ట్(33 నాటౌట్) చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. భారత బౌలర్లలో జడేజా రెండు వికెట్లు, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, దూబే చెరో వికెట్ తీసుకున్నారు.