టీమిండియా మాజీ స్టార్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మరో ఘనతను సాధించాడు. ఐపీఎల్ లో 150 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. దీంతో 150 వికెట్లు తీసిన నాలుగో బౌలర్గా అవతరించాడు. కాగా, భారత్ తరపున మూడో బౌలర్గా నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో భజ్జీ ఈ రికార్డును అందుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లను సాధించిన బౌలర్లలో శ్రీలంకకు చెందిన లసిత్ మలింగ (169) అగ్ర స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో అమిత్ మిశ్రా (157), పియూష్ చావ్లా (150) ఉన్నారు.