వరల్డ్ కప్ తర్వాత వన్డే క్రికెట్‌కు డుమిని వీడ్కోలు

|

Mar 16, 2019 | 7:09 AM

కేప్‌టౌన్‌  : సౌతాఫ్రికా ఆల్‌ రౌండర్‌ జెపీ డుమిని వన్డే క్రికెట్‌కు గుడ్ బై చెప్పనున్నాడు.  2019 ప్రపంచకప్‌ తర్వాత వన్డే క్రికెట్‌ నుంచి తప్పుకోనున్నట్లు డుమిని ప్రకటించాడు.  ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కఠినతరమైనవే.. అయినప్పటికీ క్రికెట్‌ నుంచి తప్పుకొనేందకు ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు డుమిని తెలిపాడు. ఇకపై తన కుటుంబం కోసం కాస్త ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాడు. రిటైర్మెంట్‌ తర్వాత అంతర్జాతీయ టీ20లతో పాటు దేశవాళీ క్రికెట్‌ ఆడతానని పేర్కొన్నాడు. ‘నేను కలలు […]

వరల్డ్ కప్ తర్వాత వన్డే క్రికెట్‌కు డుమిని వీడ్కోలు
Follow us on

కేప్‌టౌన్‌  : సౌతాఫ్రికా ఆల్‌ రౌండర్‌ జెపీ డుమిని వన్డే క్రికెట్‌కు గుడ్ బై చెప్పనున్నాడు.  2019 ప్రపంచకప్‌ తర్వాత వన్డే క్రికెట్‌ నుంచి తప్పుకోనున్నట్లు డుమిని ప్రకటించాడు.  ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కఠినతరమైనవే.. అయినప్పటికీ క్రికెట్‌ నుంచి తప్పుకొనేందకు ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు డుమిని తెలిపాడు. ఇకపై తన కుటుంబం కోసం కాస్త ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాడు. రిటైర్మెంట్‌ తర్వాత అంతర్జాతీయ టీ20లతో పాటు దేశవాళీ క్రికెట్‌ ఆడతానని పేర్కొన్నాడు. ‘నేను కలలు కన్న క్రీడలో రాణించేందుకు శ్రమిస్తూనే ఉన్నాను.. అందుకోసం నాకు మద్దతుగా నిలిచిన జట్టు సభ్యులు, కోచ్‌, కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అని తెలిపాడు.

కాగా 2011, 2015 వరల్డ్ కప్స్‌లో సౌతాఫ్రికా జెట్టుకు సేపవలందించాడు డుమిని. ఈ ప్రపంచకప్‌ అతనికి మూడో టోర్నీ. 2017లోనే టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. డుమిని ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడుతున్నాడు. 193 వన్డేలాడిన డుమిని 37.39 సగటుతో 5,047పరుగులు చేశాడు. 68 వికెట్లు సొంతం చేసుకున్నాడు.