నిలకడగా ఆడుతున్న కివీస్.. 30 ఓవర్లకు 113/2

|

Jul 09, 2019 | 5:13 PM

మాంచెస్టర్: ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానం వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య వరల్డ్‌కప్ సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్.. భారత్ బౌలర్ల ధాటికి కుదేలయ్యింది. ఆరంభంలోనే ఓపెనర్ గుప్తిల్(1) పెవిలియన్ చేరగా.. 19వ ఓవర్లో మరో ఓపెనర్ నికోలస్(28) జడేజా బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ఉన్న కెప్టెన్ కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ చక్కటి ఆట కనబరుస్తున్నారు. 30 ఓవర్లు ముగిసేటప్పటికి న్యూజిలాండ్ 2 వికెట్లు […]

నిలకడగా ఆడుతున్న కివీస్.. 30 ఓవర్లకు 113/2
Follow us on

మాంచెస్టర్: ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానం వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య వరల్డ్‌కప్ సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్.. భారత్ బౌలర్ల ధాటికి కుదేలయ్యింది. ఆరంభంలోనే ఓపెనర్ గుప్తిల్(1) పెవిలియన్ చేరగా.. 19వ ఓవర్లో మరో ఓపెనర్ నికోలస్(28) జడేజా బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ఉన్న కెప్టెన్ కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ చక్కటి ఆట కనబరుస్తున్నారు. 30 ఓవర్లు ముగిసేటప్పటికి న్యూజిలాండ్ 2 వికెట్లు నష్టపోయి 113 చేసింది. విలియమ్సన్ అర్ధ సెంచరీ పూర్తి చేయగా.. టేలర్ 21 పరుగులు చేశాడు.