ఇండియాలో పలు బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు చెక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఎప్పటికప్పుడు ఈ దేశంతో ‘టచ్’లోనే ఉండడం విశేషం.రీసెంట్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పేలవ ప్రదర్శనపై విజయ్ మాల్యా స్పందించారు. ఈ జట్టుకు మాజీ యజమాని అయిన మాల్యా.. ‘ఆర్సీబీ జట్టు ఎప్పుడూ బలంగానే ఉంటుందని కానీ అది పేపర్పై మాత్రమేనంటూ’ వెటకారంగా ట్వీట్ చేశారు. ఇది ఇలా ఉంటే 2008 నుంచి మొదలుకొని తాజా సీజన్ వరకు ఆర్సీబీ పేలవమైన ఆటను ప్రదర్శిస్తూ ఒక్కసారి కూడా టైటిల్ దక్కించుకోలేకపోయింది.
ఇకపోతే ఈ సీజన్లో కోహ్లీ సేన చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచి టోర్నీ నుంచి వైదొలిగింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్లో ‘మాపై చూపించిన ప్రేమ, మద్దతకు ధన్యవాదాలు. మొత్తం జట్టుతో పాటు అభిమానులు, గ్రౌండ్ స్టాఫ్, సపోర్టింగ్ స్టాఫ్కు ధన్యవాదాలు. వచ్చే ఏడాది మరింత స్ట్రాంగ్గా వస్తాం’ అంటూ కామెంట్ పోస్ట్ చేశాడు. ఇక ఈ పోస్ట్పై విజయ్ మాల్యా తనదైన శైలిలో ఇలా పంచ్ ఇచ్చాడు. ‘ఆర్సీబీ ఎప్పుడూ గ్రేట్ లైనప్ని కలిగి ఉంది. కానీ బాధపడాల్సిన విషయం ఏంటంటే అది పేపర్పైనే మాత్రమే’ అంటూ ఆర్సీబీ జట్టుకు చురకలు అంటించాడు.
Always a great line up but sadly on paper only. Devastated with the wooden spoon. https://t.co/6uYYbXJxVq
— Vijay Mallya (@TheVijayMallya) May 5, 2019