అరుదైన ఘనత సాధించిన షకీబ్

|

Jun 03, 2019 | 8:43 AM

బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హాసన్ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచకప్‌లో భాగంగా ఓవల్ వేదికగా నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో షకీబ్ 5 వేలకు పైగా పరుగులు, 250కి పైగా వికెట్లు తీసిన ఆల్ రౌండర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సఫారీ ఆటగాడు మార్క్‌రం వికెట్ తీసి.. షకీబ్ ఈ ఘనత సాధించాడు. అటు నిన్న జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ […]

అరుదైన ఘనత సాధించిన షకీబ్
Follow us on

బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హాసన్ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచకప్‌లో భాగంగా ఓవల్ వేదికగా నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో షకీబ్ 5 వేలకు పైగా పరుగులు, 250కి పైగా వికెట్లు తీసిన ఆల్ రౌండర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సఫారీ ఆటగాడు మార్క్‌రం వికెట్ తీసి.. షకీబ్ ఈ ఘనత సాధించాడు.

అటు నిన్న జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణేత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 330 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా నిర్దేశించిన ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 309 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో బంగ్లా 21 పరుగులు తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన షకీబ్ అల్ హాసన్‌కు  ‘మ్యాన్ అఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.