టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ముంబయి

|

May 05, 2019 | 8:22 PM

ముంబయి:  ఐపిఎల్‌లో భాగంగా ముంబయి ఇండియన్స్‌ మరియు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య మరికొద్దిసేపట్లో ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ జరగనుంది. ముంబయి కెప్టెన్‌ రోహిత్‌శర్మ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నాడు. కాగా ఇప్పటికే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరిన ఆ జట్టు ఆఖరి మ్యాచ్‌లోనూ గెలిచి ఘనంగా వెళ్లాలని చూస్తోంది. మరోవైపు 12 పాయింట్లతో ఉన్న కోల్‌కతా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్స్‌కు చేరాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఓడిపోయి ముంబయి గెలిస్తే […]

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ముంబయి
Follow us on

ముంబయి:  ఐపిఎల్‌లో భాగంగా ముంబయి ఇండియన్స్‌ మరియు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య మరికొద్దిసేపట్లో ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ జరగనుంది. ముంబయి కెప్టెన్‌ రోహిత్‌శర్మ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నాడు. కాగా ఇప్పటికే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరిన ఆ జట్టు ఆఖరి మ్యాచ్‌లోనూ గెలిచి ఘనంగా వెళ్లాలని చూస్తోంది. మరోవైపు 12 పాయింట్లతో ఉన్న కోల్‌కతా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్స్‌కు చేరాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఓడిపోయి ముంబయి గెలిస్తే సన్‌రైజర్స్ ప్లేఆప్స్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది.