మొహాలీ: ఐపీఎల్ 12వ సీజన్ చివరి దశకు చేరుకుంది. లీగ్ మ్యాచ్లకు నేడే ఆఖరి రోజు. ఇందులో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మరి కొద్దిసేపట్లో మ్యాచ్ జరగనుంది. మొహాలీ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న చెన్నై తన స్థానాన్ని పదిల పరుచుకోవాలని భావిస్తోంది. మరో వైపు ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేసుకోవాలని పంజాబ్ ప్రయత్నిస్తోంది.
#KXIP win the toss and elect to bowl first against #CSK pic.twitter.com/Iuy5Zd4uEn
— IndianPremierLeague (@IPL) May 5, 2019