పంజాబ్‌ టార్గెట్ 171

|

May 05, 2019 | 6:30 PM

మొహాలి: పంజాబ్‌తో జరుగుతున్న ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్ణిత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఫా డు ప్లెసిస్‌(96; 55 బంతుల్లో 10×4, 4×6) సెంచరీ జస్ట్ మిస్ అవ్వగా… వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌రైనా(53; 38 బంతుల్లో 5×4, 2×6) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఆదిలోనే షేన్‌వాట్సన్‌(7) ఔటవ్వడంతో వీరిద్దరూ రెండో వికెట్‌కు 120 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. రైనా అర్ధశతకం తర్వాత ఔటవ్వగా […]

పంజాబ్‌ టార్గెట్ 171
Follow us on

మొహాలి: పంజాబ్‌తో జరుగుతున్న ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్ణిత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఫా డు ప్లెసిస్‌(96; 55 బంతుల్లో 10×4, 4×6) సెంచరీ జస్ట్ మిస్ అవ్వగా… వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌రైనా(53; 38 బంతుల్లో 5×4, 2×6) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఆదిలోనే షేన్‌వాట్సన్‌(7) ఔటవ్వడంతో వీరిద్దరూ రెండో వికెట్‌కు 120 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. రైనా అర్ధశతకం తర్వాత ఔటవ్వగా కాసేపటికే  డు ప్లెసిస్‌ పెవిలియన్‌ చేరాడు. ఆఖరి నాలుగు ఓవర్లలో చెన్నై నాలుగు వికెట్లు కోల్పోవడంతో 170 పరుగులకే పరిమితమైంది. పంజాబ్‌ బౌలర్లలో సామ్‌కరన్‌ మూడు, మహ్మద్‌ షమీ రెండు వికెట్లు తీశారు.