ఐపీఎల్ 2019లో భాగంగా ముంబై జట్టు ప్లేఆఫ్కి చేరడంలో హార్దిక్ పాండ్య క్రియాశీలక పాత్ర పోషించాడు. సీజన్ ఆరంభంలో తన పవర్ హిట్టింగ్తో టీమ్కి భారీ స్కోర్లు అందించిన హార్దిక్ పాండ్య.. ఆ తర్వాత బౌలింగ్లోనూ వికెట్లు పడగొడుతూ బౌలర్లకు అండగా నిలుస్తున్నాడు. తాజా సీజన్లో 14 మ్యాచ్లాడిన హార్దిక్ పాండ్య 380 పరుగులు చేయడమే కాకుండా… 14 వికెట్లు కూడా పడగొట్టాడు.
ముంబైలో వాంఖడే వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లోనూ హార్దిక్ పాండ్య బంతితో సత్తాచాటి ప్రమాదకర ఓపెనర్ క్రిస్లిన్ (41: 29 బంతుల్లో 2×4, 4×6)తో పాటు శుభమన్ గిల్ (9)లను వరుస ఓవర్లలో ఔట్ చేసేశాడు. దీంతో.. ఒత్తిడికి గురైన కోల్కతా 133/7కే పరిమితమవగా.. లక్ష్యాన్ని మరో 23 బంతులు మిగిలి ఉండగానే ముంబై 134/1తో ఛేదించింది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయిన కోల్కతా ఇంటిబాట పట్టగా.. ముంబై జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్లో 4 ఓవర్లు వేసి 20 పరుగులకే రెండు వికెట్లు పడగొట్టిన హార్దిక్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
Hardik Pandya is the Man of the Match for his bowling figures of 2/20 ?? pic.twitter.com/mnFxBgKe08
— IndianPremierLeague (@IPL) May 5, 2019