హైదరాబాద్లో ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ భాగ్యనగరానికి క్యూ కట్టేస్తున్నారు. మ్యాచ్ చూడటం కోసం ఫ్లైట్ టిక్కెట్లతో పాటు హోటల్ రూమ్ల కోసం పోటీపడుతున్నారు. ఒక్కసారిగా హోటల్ బుకింగ్ ఎంక్వైరీలు ఊపందుకున్నాయట. క్రికెట్ ఫ్యాన్స్.. అందులోనూ ముంబైతో పాటు మహారాష్ట్రలోని నగరాల నుంచి ఎక్కువ బుకింగ్స్ ఉన్నాయని సమాచారం. ఫైనల్కు చేరిన ముంబై టీమ్కు మద్దతుగా హైదరాబాద్ వచ్చేస్తున్నారట. శనివారం, ఆదివారం కోసం హోటల్ రూమ్స్ బుక్ చేసుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది ముంబై, పుణె నుంచి ఉన్నారట. చెన్నై-ఢిల్లీ మధ్య మ్యాచ్ తర్వాత ఈ బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా. హైదరాబాద్లో ఈ వారంలోనే హోటల్ రూమ్ బుకింగ్స్ ఏకంగా 40 శాతం పెరిగిపోయాయట.
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ముంబై ఇప్పటికే ఫైనల్ చేరుకోగా.. శుక్రవారం చెన్నై-ఢిల్లీ మధ్య జరిగే క్వాలిఫయర్ మ్యాచ్లో గెలిచిన టీమ్ ఫైనల్లో ముంబైతో తలపడుతుంది.