ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌: మన టాప్ ప్లేయర్స్ చేతులెత్తేశారు..

|

Apr 26, 2019 | 8:08 PM

వుహాన్‌: చైనాలో జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ ఓటమి పాలయ్యారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో జపాన్‌ క్రీడాకారిణి అకానె యమగుచి చేతిలో సైనా నెహ్వాల్‌ 13-21, 23-21, 16-21 తేడాతో ఓడిపోగా.. చైనా క్రీడాకారిణి కాయ్‌ యన్‌యన్‌ చేతిలో పీవీ సింధు 19-21, 9-21 తేడాతో ఓడిపోయింది. కాగా పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో సమీర్‌ వర్మ 10-21, 12-21 తేడాతో చైనా క్రీడాకారుడు షి […]

ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌: మన టాప్ ప్లేయర్స్ చేతులెత్తేశారు..
Follow us on

వుహాన్‌: చైనాలో జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ ఓటమి పాలయ్యారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో జపాన్‌ క్రీడాకారిణి అకానె యమగుచి చేతిలో సైనా నెహ్వాల్‌ 13-21, 23-21, 16-21 తేడాతో ఓడిపోగా.. చైనా క్రీడాకారిణి కాయ్‌ యన్‌యన్‌ చేతిలో పీవీ సింధు 19-21, 9-21 తేడాతో ఓడిపోయింది.

కాగా పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో సమీర్‌ వర్మ 10-21, 12-21 తేడాతో చైనా క్రీడాకారుడు షి యుకీ చేతిలో ఘోరంగా ఓడిపోయాడు. మరోవైపు కిదాంబి శ్రీకాంత్‌ సైతం ఇండోనేషియా ఆటగాడు షెసర్‌ హిరెన్‌ రుస్తోవిటో చేతిలో 16-21, 20-22 తేడాతో ఓటమిచెందాడు.