అమ్మవారి నుదుట సింధూరం..రాశులుగా రాలుతోంది..!

| Edited By: Anil kumar poka

Feb 25, 2020 | 7:18 PM

గణేషుడు తొడంతో పాలు తాగుతున్నాడు అనే వార్తలు మనం తరచూ వింటుంటాం. ఆలయంలో సాయిబాబా నీడ కనిపించదనే వార్తలు కూడా వచ్చాయి. ఆ మధ్యకాలంలో అనంతపురం జిల్లాలో సత్యసాయి ఫోటో నుండి రాశుల కొద్దీ విభూతి...

అమ్మవారి నుదుట సింధూరం..రాశులుగా రాలుతోంది..!
Follow us on

గణేషుడు తొండంతో పాలు తాగుతున్నాడు అనే వార్తలు మనం తరచూ వింటుంటాం. ఆలయంలో సాయిబాబా నీడ కనిపించదనే వార్తలు కూడా వచ్చాయి. ఆ మధ్యకాలంలో అనంతపురం జిల్లాలో సత్యసాయి ఫోటో నుండి రాశుల కొద్దీ విభూతి రాలుతోందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో మరో అద్భుత దృశ్యం ఆవిషృతం అయింది. ఆ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు క్యూ కడుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలోని పి.గన్నవరం మండలంలో వింత సంఘటన చోటు చేసుకుంది. అరుమిల్లి సీతామహాలక్ష్మి అనే మహిళ రోజులాగే ఇంట్లో పూజ పూర్తి చేసుకుంది. అమ్మవారికి నమస్కరిస్తుండగా ఆమెకు ఒక్కసారిగా ఆశ్చర్యకరమైన విషయం కనిపించింది. కనకదుర్గమ్మ అమ్మవారి ఫోటో నుండి కుంకుమ రాలటం కనిపించింది. ఆరోజంతా అలా ఫోటోలోని అమ్మవారి నుదుటి నుంచి కుంకుమ రాలుతూనే ఉంది. రెండు రోజులుగా అలాగే జరుగుతుండటంతో విషయం చుట్టుపక్కల జనాలకు తెలిసింది. దీంతో స్థానికులు పెద్ద సంఖ్యలో సీతామహాలక్ష్మి ఇంటికి క్యూ కడుతున్నారు. సాక్ష్యత్తు అమ్మవారే ఇక్కడికి కదిలి వచ్చారంటూ పూజలు, అభిషేకాలు చేస్తున్నారు.