Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి స్పెషల్‌ రైళ్లు..

|

Jan 22, 2021 | 7:18 AM

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు వెల్లడించారు . సికింద్రాబాద్‌-తిరుపతి స్పెషల్..

Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి స్పెషల్‌ రైళ్లు..
Follow us on

Special Trains : ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు వెల్లడించారు . సికింద్రాబాద్‌-తిరుపతి స్పెషల్‌ (02732) రైలు ఈనెల 27న సికింద్రాబాద్‌ నుంచి ప్రారంభమవుతుంది. ప్రతి బుధ, శనివారం సాయంత్రం 4.15 గంటలకు ఇది బయలుదేరనుంది.

తిరుపతి-సికింద్రాబాద్‌ స్పెషల్‌ (02731) తిరుపతి నుంచి ఈనెల 28న ప్రారంభమవుతుంది. ఈ రైలు గురు, ఆదివారం సా యంత్రం 5 గంటలకు బయలుదేరుతుంది. సికింద్రాబాద్‌-తిరుపతి స్పెషల్‌ (02770) సికింద్రాబాద్‌ నుంచి ఈనెల 26న మొదలవుతుంది. మంగళ, శుక్రవారం సాయంత్రం 5.40 గంటలకు ఇది ప్రారంభమవుతుంది.

తిరుపతి-సికింద్రాబాద్‌ స్పెషల్‌ (02769) తిరుపతి నుంచి ఈ నెల 29న ప్రారంభమవుతుంది. ప్రతి సోమ, శుక్రవారం సాయంత్రం 3.45గంటలకు ఈ రైలు బయలుదేరుతుంది. తిరుపతి-కరీంనగర్‌ స్పెషల్‌ (02761) తిరుపతి నుంచి ఈనెల 27న ప్రారంభమవుతుంది. బుధ, శనివారం రాత్రి 8.15 గంటలకు ఇది బయలుదేరుతుంది.

కరీంనగర్‌-తిరుపతి స్పెషల్‌ (02762) కరీంనగర్‌ నుంచి ఈ నెల 28న మొదలవుతుంది. గురు, ఆదివారం రాత్రి 7.15 గంటలకు ఈ రైలు బయలుదేరుతుంది. గౌహతి-సికింద్రాబాద్‌(02514), సికింద్రాబాద్‌-గౌహతి స్పెషల్‌ (02513) రైళ్లను ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు పొడిగించారు.