ముకేశ్ అంబానీ ఇంట కరెంట్ వెలుగులు ఎలా.?

భారత దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు. అంతేకాక ఆయన వెర్సిటాలిటీకి మారుపేరు. రోజూ ఉపయోగించే వస్తువుల దగ్గర నుంచి నివసించే భవంతి వరకు అన్నీ కూడా అత్యద్భుతంగా ఉంటాయి. దక్షిణ ముంబై ప్రాంతంలోని ఆంటీలియా అనే ఇంద్రభవనంలో ఆయన నివసిస్తున్న సంగతి తెలిసిందే. ఈ 27 అంతస్తుల ప్యాలెస్‌లో దాదాపు 600 మంది పనివాళ్ళు ఉన్నారు. అంబానీ తన ఇంట్లోని ప్రతి వస్తువును చాలా జాగ్రత్తగా ఉపయోగించాలని.. అంతేకాక ఒక సిస్టమేటిక్‌గా పని […]

ముకేశ్ అంబానీ ఇంట కరెంట్ వెలుగులు ఎలా.?
Follow us

|

Updated on: Oct 06, 2019 | 6:24 PM

భారత దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు. అంతేకాక ఆయన వెర్సిటాలిటీకి మారుపేరు. రోజూ ఉపయోగించే వస్తువుల దగ్గర నుంచి నివసించే భవంతి వరకు అన్నీ కూడా అత్యద్భుతంగా ఉంటాయి. దక్షిణ ముంబై ప్రాంతంలోని ఆంటీలియా అనే ఇంద్రభవనంలో ఆయన నివసిస్తున్న సంగతి తెలిసిందే. ఈ 27 అంతస్తుల ప్యాలెస్‌లో దాదాపు 600 మంది పనివాళ్ళు ఉన్నారు. అంబానీ తన ఇంట్లోని ప్రతి వస్తువును చాలా జాగ్రత్తగా ఉపయోగించాలని.. అంతేకాక ఒక సిస్టమేటిక్‌గా పని చేయాలని వారికి ఆదేశాలు జారీ చేశారు.

అసలే అదొక ఇంద్రభవనం.. ఆపై చాలామంది అందులో ఉంటున్నారు. ఇక దానికి తగ్గట్టుగానే అధిక మోతాదులో వ్యర్ధాలు ఉండిపోతాయి. ఇక ఈ వ్యర్ధాలను తొలగించడానికి అంబానీ సరికొత్త వ్యూహాన్ని అమలు చేశారట. ఈ చెత్తనంతా విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తారని సమాచారం. తడి, పొడి చెత్తలను రెండు కూడా వేరు చేస్తారట. తడి చెత్తనంతా తీసి డంప్ చేసి.. పొడి చెత్తను కరెంట్ కోసం వాడతారని తెలుస్తోంది.

మరోవైపు ఈ మహాభవంతి పైనే.. హెలికాఫ్టర్లు ల్యాండ్ కావడానికి అనువుగా మూడు హెలిప్యాడ్స్ ఉన్నాయి. అంతేకాక అక్కడ దాదాపు 168 కార్లు పార్కింగ్ చేసుకోగలిగే చోటు కూడా ఉంటుంది. ఇక ఇంటీరియర్ గురించి మాట్లాడుకుంటే.. స్పా రూమ్, డ్యాన్సింగ్ స్టూడియో, థియేటర్ రూమ్, ప్లే రూమ్, టెర్రాస్ గార్డెన్స్, దేవాలయంతో పాటుగా ఇంకా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి.

నవంబర్ 2014 ప్రకారం ఈ భవంతి దాదాపు $2 బిలియన్స్ రేటు ఉంటుందని అంచనా. అంతేకాకుండా భారీ భూకంపాలను కూడా ఈ భవనం తట్టుకోగలిగేలా రూపొందించారట. ఇది ప్రపంచంలోనే రెండో విలువైన రెసిడెన్షియల్ భవంతి.. మొదటి స్థానంలో ఇంగ్లాండ్ బక్‌కింగమ్ ప్యాలస్ ఉంది.