మీ అయిదేళ్ల పాలన గురించి తెలియదా.. : విజయసాయిరెడ్డి

| Edited By:

Aug 31, 2019 | 3:40 PM

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ నేతలపై ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మరోసారి మండిపడ్డారు. రాజకీయాల్లో హింసా ప్రవృత్తికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబే ఆద్యుడంటూ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. వారు అధికారంలో ఉన్నప్పుడు వేల మంది వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారంటూ గుర్తు చేశారు. ట్విట్టర్ ద్వారా టీడీపీ నేతలపై చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయాల్లో హింసా ప్రవృత్తికి ఆద్యుడు చంద్రబాబు గారని.. ఆయన ఐదేళ్ల రాక్షస పాలనలో వందల మంది వైసీపీ నేతలు […]

మీ అయిదేళ్ల పాలన గురించి తెలియదా.. : విజయసాయిరెడ్డి
Follow us on

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ నేతలపై ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మరోసారి మండిపడ్డారు. రాజకీయాల్లో హింసా ప్రవృత్తికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబే ఆద్యుడంటూ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. వారు అధికారంలో ఉన్నప్పుడు వేల మంది వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారంటూ గుర్తు చేశారు. ట్విట్టర్ ద్వారా టీడీపీ నేతలపై చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

రాజకీయాల్లో హింసా ప్రవృత్తికి ఆద్యుడు చంద్రబాబు గారని.. ఆయన ఐదేళ్ల రాక్షస పాలనలో వందల మంది వైసీపీ నేతలు జైళ్ల పాలయ్యారని ఆరోపించారు. వేల మందిని గ్రామాల నుంచి తరిమేశారని.. 600 మందిని హత్య చేశారంటూ ట్వీట్ చేశారు. వృద్ధ జంబూకం శాంతి వచనాలు పలికినట్టు ఇప్పుడు వేధింపుల గురించి మాట్లాడుతున్నారంటూ పేర్కొన్నారు.

ఇక మరో ట్వీట్‌లో చంద్రబాబుతో పాటు నారా లోకేష్‌ను కూడా ఉద్దేశిస్తూ పేర్కొన్నారు. తండ్రీ కొడుకులిద్దరూ.. ఇంట్లో కట్టేసిన పెంపుడు కుక్కలన్నింటినీ గొలుసులు విప్పి వదిలేశారంటూ ట్వీట్ చేశారు. అవి దారిన పోయే వాళ్ళందరి వెంట పడుతున్నాయని.. ఈయన ఉస్కో అంటే మొరగటమొక్కటే వాటికి తెలుసని.. మొరిగే కుక్కలను తరిమికొట్టిన తర్వాత తమకు బడితె పూజేనని మర్చి పోయినట్టున్నారంటూ పేర్కొన్నారు.

మరిన్ని ట్వీట్లలో నారా లోకేష్‌ని ఉద్దేశిస్తూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఇసుక మాఫియా, రాజధాని ప్రాంతంలో వరద గురించి కూడా ప్రస్తావించారు.