విజయసాయి రెడ్డి బయట మాట్లాడటం కన్నా.. ట్విట్టర్లో ఎక్కువగా హల్చల్ చేస్తూంటారు. తాజాగా.. మాజీ మంత్రి నారా లోకేష్పై ట్వీట్ చేశారు. ‘మంగళగిరి ప్రజల ఈడ్చి కొట్టిన తర్వాత లోకేష్ చిటికెడు మెదడు మరింత చిట్లినట్టుంది. స్థాయికి మరచి చెలరేగుతున్నారు. మీ తండ్రి చీకట్లో చిదంబరం పట్టుకుని మాపై కుట్ర చేశారు. ఇప్పుడు అదే చిదంబరం, ఆయన కొడుకు బెయిలుపై ఉన్నారు. మీ దొంగల ముఠాకు మూడే రోజు దగ్గర్లోనే ఉంద’ని ట్వీట్ చేశారు.
మంగళగిరి ప్రజలు ఈడ్చి కొట్టిన తర్వాత లోకేశ్ చిటికెడు మెదడు మరింత చిట్లినట్టుంది. స్థాయికి మరచి చెలరేగుతున్నారు. మీ తండ్రి చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకుని మాపై కుట్ర చేశారు. ఇప్పడు అదే చిదంబరం, ఆయన కొడుకు బెయిలుపై ఉన్నారు. మీ దొంగల ముఠాకు మూడే రోజు దగ్గర్లోనే ఉంది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 29, 2019