చంద్రబాబు కష్టం పగవాడికి కూడా రావొద్దు: విజయసాయి రెడ్డి

| Edited By:

Aug 15, 2019 | 2:03 PM

మాజీ సీఎం కష్టం పగవాడికి కూడా రావొద్దని అన్నారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. తాజాగా.. మరోసారి చంద్రబాబుపై ఆయన విరుచుకుపడ్డారు. కరకట్టలోపల నిర్మించిన చంద్రబాబు ఇళ్లు.. కృష్ణానదిలో మునిగిపోయిందని.. ఇళ్లు విడిచి ఆయన హైదరాబాద్‌కు పారిపోయారని ఎద్దేవా చేశారు. అక్రమంగా ఆస్తులు సంపాదిస్తే.. ఇలానే ఉంటుందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్‌ చేస్తూ.. చంద్రబాబు కష్టం పగవాడికి కూడా రాకూడదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నది పూడిస్తే.. ఇంత అనర్థం ఉండేది కాదు […]

చంద్రబాబు కష్టం పగవాడికి కూడా రావొద్దు: విజయసాయి రెడ్డి
Follow us on

మాజీ సీఎం కష్టం పగవాడికి కూడా రావొద్దని అన్నారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. తాజాగా.. మరోసారి చంద్రబాబుపై ఆయన విరుచుకుపడ్డారు. కరకట్టలోపల నిర్మించిన చంద్రబాబు ఇళ్లు.. కృష్ణానదిలో మునిగిపోయిందని.. ఇళ్లు విడిచి ఆయన హైదరాబాద్‌కు పారిపోయారని ఎద్దేవా చేశారు. అక్రమంగా ఆస్తులు సంపాదిస్తే.. ఇలానే ఉంటుందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్‌ చేస్తూ.. చంద్రబాబు కష్టం పగవాడికి కూడా రాకూడదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నది పూడిస్తే.. ఇంత అనర్థం ఉండేది కాదు కాదా అంటూ.. చంద్రబాబుని ఉద్ధేశించి ట్వీట్‌లో పేర్కొన్నారు.