ఎవరి కోసం ఈ ఎన్నికలు..? ప్రజల ప్రాణాలను నిమ్మగడ్డ ఫణంగా పెడుతున్నారన్న ఎంపీ బాలశౌరి

|

Jan 25, 2021 | 2:46 PM

ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగలడంతో ఇక ఎన్నికల సంఘానికి..

ఎవరి కోసం ఈ ఎన్నికలు..? ప్రజల ప్రాణాలను నిమ్మగడ్డ ఫణంగా పెడుతున్నారన్న ఎంపీ బాలశౌరి
Follow us on

ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగలడంతో ఇక ఎన్నికల సంఘానికి ఊరట లభించినట్లైంది. హైకోర్టు తీర్పు అనంతరం ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలై నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. అయితే పంచాయతీ ఎన్నికలకు సహకరించమని ప్రకటించిన ఉద్యోగ సంఘాలు నామినేషన్ల స్వీకరించేందుకు సహాయ నిరాకరణ చేపట్టాయి. దీంతో అభ్యర్థులు నిరాశగా వెనుతిరుగుతున్నారు.

ప్రభుత్వం అభ్యంతరాల నడుమ ఎన్నికలు నిర్వహించేందుకు దూకుడు పెంచుతున్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై వైసీపీ నేతలు మాటల యుద్ధం మొదలు పెట్టారు. ముఖ్యంగా మంత్రులు, ఎంపీలు నిమ్మగడ్డపై విమర్శలు గుప్పిస్తారు. తాజాగా ఎంపీ బాలశౌరి ఆరోపణాస్త్రాలు సందించారు.

SEC నిమ్మగడ్డ ఎవరికోసం ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఎంపీ బాలశౌరి ప్రశ్నించారు. వర్చువల్‌లో కోర్టుకు హాజరయ్యే నిమ్మగడ్డ.. ప్రజల ప్రాణాలను మాత్రం ఫణంగా పెట్టాలనుకుంటున్నారని ఆరోపించారు. కరోనా మధ్య ఎన్నికలు నిర్వహించడం తగదన్నారు.