రాష్ట్రంలో కావాలనే టీడీపీ అల్లకల్లోలం సృష్టిస్తుంది

| Edited By:

Mar 11, 2020 | 3:38 PM

ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కావాలనే చంద్రబాబు అల్లకల్లోలం సృష్టించాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ. తాజాగా.. గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతల కారుపై జరిగిన దాడులపై..

రాష్ట్రంలో కావాలనే టీడీపీ అల్లకల్లోలం సృష్టిస్తుంది
Follow us on

ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కావాలనే చంద్రబాబు అల్లకల్లోలం సృష్టించాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ. తాజాగా.. గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతల కారుపై జరిగిన దాడులపై బొత్స స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ డొల్లతనం బయటపడుతుందని.. అందుకే రాష్ట్రంలో కావాలనే చంద్రబాబు అల్లకల్లోలం సృష్టిస్తున్నారన్నారు.

స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని టీడీపీకి అర్థమైపోయింది. అందుకే కావాలని కార్లు తీసుకుని అలజడి సృష్టించడానికి మాచర్ల వెళ్లారన్నారు. బోండా ఉమ, బుద్ధా వెంకన్న కలిసి 10 కార్లలో మాచర్ల వెళ్లారు. పది కార్లలో ఊరేగింపుగా వెళ్తూ.. యాక్సిడెంట్ చేశారు. దీంతో స్థానికులు ఆగ్రహించారు. ఆ ఘటనపైనే ప్రజలు రియాక్ట్ అయ్యారు తప్ప.. ఎవరూ కావాలని చేయలేదని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ఏపీలో స్థానిక ఎన్నికలు సందర్భంగా.. అన్ని పార్టీలూ బిజీగా ఉన్నాయి. ఒక్క టీడీపీనే రాష్ట్రంలో అలజడి సృష్టించాలని అనుకుంటోంది. కావాలనే చంద్రబాబు వైసీపీపై ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబుకు ప్రజాబలం లేదు. ఓడిపోతామనే భయం పట్టుకుంది. అందుకే మాచర్లకు చంద్రబాబు గూండాలను పంపారని ఆరోపణలు చేశారు బొత్స సత్యనారాయణ.

Read More: లాయర్ తల పగిలింది.. మేము ప్రాణాలతో.. వస్తామో.. రామో..

టీడీపీ నేతల కారుపై దాడి.. చంద్రబాబు ఫైర్

వేలానికి మాజీ మంత్రి గంటా ఆస్తులు..