జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత విజయసాయి రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు పేమెంట్ బాగా పెంచడంతో జనసేనాని పవన్ కళ్యాణ్ తెగ రెచ్చిపోతున్నారని విమర్శించారు. శనివారం ట్విటర్ వేదికగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ను ఏప్రిల్ 11 వరకు భరించక తప్పదని మండిపడ్డారు. ‘పేమెంటు బాగా పెంచినట్టున్నారు చంద్రబాబు. పవన్ కల్యాణ్ తెగ రెచ్చిపోతున్నారు. తెలంగాణలో ప్రశాంతంగా జీవిస్తున్న వారిని కూడా రాజకీయ సమిధలుగా చేసి మాట్లాడుతున్నారు. కాసింత కూడా బాధ్యత లేని నీచులు చంద్రబాబు రాజ్యంలో రంకెలేస్తున్నారు. ఏప్రిల్ 11 వరకు భరించతప్పదేమో.’ అని ట్వీట్ చేశారు.
పేమెంటు బాగా పెంచినట్టున్నారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ తెగ రెచ్చిపోతున్నారు. తెలంగాణలో ప్రశాంతంగా జీవిస్తున్న వారిని కూడా రాజకీయ సమిధలుగా చేసి మాట్లాడుతున్నారు. కాసింత కూడా బాధ్యత లేని నీచులు చంద్రబాబు రాజ్యంలో రంకెలేస్తున్నారు. ఏప్రిల్ 11 వరకు భరించతప్పదేమో.
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 23, 2019
మరోవైపు చంద్రబాబు, పవన్, కేఏ పాల్లను ఉద్దేశించి సెటైర్లు విసిరారు. మీ అందరికీ వైసీపీ విజయంపై ఓ క్లారిటీ ఉందని.. గెలిచే పార్టీపైనే ఎన్నికల్లో అన్ని పక్షాలు టార్గెట్ చేస్తాయని అన్నారు. అందుకే క్షణక్షణం వైఎస్ జగన్ పై విమర్శలకు దిగుతున్నారని అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఎవరి కోసం పనిచేస్తున్నారో.. టీడీపీని వెనకేసుకొస్తూ ప్రతిపక్షాన్ని ఎందుకు విమర్శిస్తున్నారో.. రాష్ట్ర ప్రజలందరికి తెలుసన్నారు. ఆయనకు ఇల్లు కట్టిచ్చింది.. హెలికాప్టర్లు సమకూర్చింది.. ఎవరో తెలియనంత అమాయకులేం కాదన్నారు. ఆఖరికి జనసేన అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసింది కూడా చంద్రబాబే కాదా? అని ప్రశ్నించారు.
గెలిచే పార్టీనే ఎన్నికల్లో అన్ని పక్షాలు టార్గెట్ చేస్తాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చివరకు పాల్ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ విజయం ఖరారై పోయిందని అంగీకరిస్తున్నారు. అందుకే జగన్ గారి పైనే విమర్శల అస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ఈ విషయం లోనైనా మీ అందరికీ క్లారిటీ ఉంది. సంతోషం.
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 23, 2019