టీ, బిస్కెట్ల కోసమే పవన్, రేవంత్‌ల భేటీ: టీఆర్ఎస్ ఎమ్మెల్యే

| Edited By:

Sep 16, 2019 | 12:51 PM

యరేనియం తవ్వకాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించిన విషయం తెలిసిందే. అలాగే.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ విషయంపై అందరం ఒకటి కావాలని చెబుతూ.. రేవంత్‌ రెడ్డికి పవన్ ఫోన్‌ చేసి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సెటైర్లు విసిరారు. వీరిద్దరూ.. టీ, బిస్కెట్‌ల కోసమే సమావేశమవుతున్నారని.. పని లేనోళ్లు రౌండ్ టేబుల్ సమావేశమయితే.. ఏమీ జరగదన్నారు. యురేనియంపై అనవసర రాద్ధాంతం […]

టీ, బిస్కెట్ల కోసమే పవన్, రేవంత్‌ల భేటీ: టీఆర్ఎస్ ఎమ్మెల్యే
Follow us on

యరేనియం తవ్వకాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించిన విషయం తెలిసిందే. అలాగే.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ విషయంపై అందరం ఒకటి కావాలని చెబుతూ.. రేవంత్‌ రెడ్డికి పవన్ ఫోన్‌ చేసి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సెటైర్లు విసిరారు.

వీరిద్దరూ.. టీ, బిస్కెట్‌ల కోసమే సమావేశమవుతున్నారని.. పని లేనోళ్లు రౌండ్ టేబుల్ సమావేశమయితే.. ఏమీ జరగదన్నారు. యురేనియంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. ఏపీలో పవన్‌ రాజకీయం ముగిసిందని.. తెలంగాణలో వేలు పెడుతున్నారని విమర్శించారు. పవన్‌కు యురేనియం గురించి ఏమీ తెలియదని.. కావాలంటే.. ప్రగతిభవన్‌కి వచ్చి సీఎం కేసీఆర్‌తో చర్చించి.. ఏమైనా ఐడియాలుంటే చెప్పాలని తెలిపారు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.