రేపు వైసీపీలోకి దగ్గుబాటి వేంకటేశ్వరావు

| Edited By: Srinu

Mar 06, 2019 | 7:43 PM

బుధవారం జగన్ సమక్షంలో తాను వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నట్లు దగ్గుబాటి వేంకటేశ్వరరావు అన్నారు. తనతో పాటు తన కుమారుడు హితేశ్ చెంచురామ్, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరనున్నారని ఆయన అన్నారు. మాటకు కట్టుబడి నిలిచే నేటితరం రాజకీయ నేతల్లో వైఎస్ జగన్ ఒకరని దగ్గుబాటి వ్యాఖ్యానించారు. మార్టూరులోని ఓ కల్యాణమండపంలో తన అనుచరులు, వైసీపీనాయకులతో భేటీ నిర్వహించిన దగ్గుబాటి.. ప్రజల ఆశీస్సులతోనే మార్టూరు, పర్చూరు నిజయోకవర్గాల నుంచి తాను ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని అన్నారు. […]

రేపు వైసీపీలోకి దగ్గుబాటి వేంకటేశ్వరావు
Follow us on

బుధవారం జగన్ సమక్షంలో తాను వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నట్లు దగ్గుబాటి వేంకటేశ్వరరావు అన్నారు. తనతో పాటు తన కుమారుడు హితేశ్ చెంచురామ్, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరనున్నారని ఆయన అన్నారు. మాటకు కట్టుబడి నిలిచే నేటితరం రాజకీయ నేతల్లో వైఎస్ జగన్ ఒకరని దగ్గుబాటి వ్యాఖ్యానించారు.

మార్టూరులోని ఓ కల్యాణమండపంలో తన అనుచరులు, వైసీపీనాయకులతో భేటీ నిర్వహించిన దగ్గుబాటి.. ప్రజల ఆశీస్సులతోనే మార్టూరు, పర్చూరు నిజయోకవర్గాల నుంచి తాను ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని అన్నారు. గొట్టిపాటి భరత్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని.. జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు తామిద్దరం తమ వంతు కృషి చేస్తామని చెప్పారు.