ఏపీలో టీడీపీ ఎమ్మెల్యే ‘లేఖ’ కలకలం.. తాను రాయలేదన్న వాసుపల్లి

| Edited By:

Aug 25, 2020 | 6:05 PM

అమరావతి మద్దతును ఇస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పేరిట ఓ లేఖ విడుదలైంది

ఏపీలో టీడీపీ ఎమ్మెల్యే లేఖ కలకలం.. తాను రాయలేదన్న వాసుపల్లి
Follow us on

Vasupalli Ganesh Kumar: అమరావతి మద్దతును ఇస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పేరిట ఓ లేఖ విడుదలైంది. అందులో విశాఖ అభివృద్ధి అమరావతితోనే సాధ్యం అని, మూడు రాజధానులకు తాను వ్యతిరేకమని, అమరావతిని రాజధానిగా కొనసాగించాలని వాసుపల్లి వెల్లడించినట్లుగా ఉంది. అలాగే జగన్ ప్రభుత్వ తీరుపై కూడా తీవ్ర విమర్శలు చేసినట్లు ఉంది. అయితే ఈ లేఖపై వాసుపల్లి మండిపడ్డారు. తాను రాయని లేఖ తన పేరిట ఎలా వచ్చిందని ఆయన అధిష్టానాన్ని ప్రశ్నించారు.

పార్టీ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. ఉత్తరాంధ్రపై విషయం చిమ్మే క్రమంలో అధినేత చంద్రబాబు అండ్‌కో ఈ పని చేసి ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అలాగే గతంలో మహానాడులో తాను మాట్లాడిన వ్యాఖ్యల్ని ఇటీవల యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడంపై కూడా ఆయన విస్మయం వ్యక్తం చేశారు. దీంతో ఈ లేఖ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వాసుపల్లి రాయకపోతే.. ఆయన పేరు మీద ఈ లేఖను ఎవరు విడుదల చేశారన్న చర్చ జరుగుతోంది.

Read More:

చెర్రీకి చిరు సలహా.. ఓకే చెప్పిన మెగా పవర్‌స్టార్‌

అప్పుడు నేను, నయన్‌ పెళ్లి చేసుకుంటాం: విఘ్నేష్