టీడీపీకి మరో షాక్.. రాయపాటి కూడా..

| Edited By:

Jul 22, 2019 | 11:14 AM

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఆ దిశగా ఇప్పటి నుంచే.. పార్టీ బలోపేత చర్యలకు శ్రీకారం చుట్టుంది. ఓ వైపు తెలంగాణలోని మాజీ ఎమ్మెల్యేలను సీనియర్ నేతలను లక్ష్యంగా చేసుకుని పార్టీ కండువా కప్పుతూ కేడర్ నిర్మాణం చేసుకుంటోంది. మరో వైపు ఏపీలో టీడీపీ నేతలనే లక్ష్యంగా చేసుకుని.. ఆ పార్టీకి షాక్ ఇస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి చేరారు. తాజాగా […]

టీడీపీకి మరో షాక్.. రాయపాటి కూడా..
Follow us on

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఆ దిశగా ఇప్పటి నుంచే.. పార్టీ బలోపేత చర్యలకు శ్రీకారం చుట్టుంది. ఓ వైపు తెలంగాణలోని మాజీ ఎమ్మెల్యేలను సీనియర్ నేతలను లక్ష్యంగా చేసుకుని పార్టీ కండువా కప్పుతూ కేడర్ నిర్మాణం చేసుకుంటోంది. మరో వైపు ఏపీలో టీడీపీ నేతలనే లక్ష్యంగా చేసుకుని.. ఆ పార్టీకి షాక్ ఇస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి చేరారు. తాజాగా మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా త్వరలో కమలం గూటికి చేరుతున్నట్లు ప్రకటించారు. బీజేపీ హైకమాండ్‌తో చర్చించిన తర్వాతే తాను పార్టీ మారతానని స్పష్టం చేశారు. అయితే ఈ చర్చలు జరిగేందుకు కాస్త సమయం పడుతుందని తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రాయపాటి ఈ వ్యాఖ్యలు చేశారు.