తమిళనాడు మంత్రుల విఙ్ఞప్తికి ఓకే చెప్పిన సీఎం

| Edited By: Pardhasaradhi Peri

Aug 09, 2019 | 4:27 PM

ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డిని తమిళనాడు మంత్రుల బృందం కలిసింది. ఈ సందర్భంగా తాగునీరు లేక చెన్నైవాసులు అల్లాడుతున్నారని సీఎంకు విఙ్ఞప్తి చేశారు. దానికి సానుకూలంగా స్పందించిన జగన్.. వెంటనే చెన్నై తాగునీరు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. లక్షల మంది ఇబ్బంది పడుతుంటే మానవత్వంతో స్పందించాలని.. ఇరుగుపొరుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని ఈ సందర్భంగా జగన్ అన్నారు. అనంతరం సీఎం జగన్‌కు తమిళనాడు మంత్రుల బృందం ధన్యవాదాలు తెలిపింది. జగన్‌ను కలిసిన మంత్రులలో గణేశన్, […]

తమిళనాడు మంత్రుల విఙ్ఞప్తికి ఓకే చెప్పిన సీఎం
Follow us on

ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డిని తమిళనాడు మంత్రుల బృందం కలిసింది. ఈ సందర్భంగా తాగునీరు లేక చెన్నైవాసులు అల్లాడుతున్నారని సీఎంకు విఙ్ఞప్తి చేశారు. దానికి సానుకూలంగా స్పందించిన జగన్.. వెంటనే చెన్నై తాగునీరు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. లక్షల మంది ఇబ్బంది పడుతుంటే మానవత్వంతో స్పందించాలని.. ఇరుగుపొరుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని ఈ సందర్భంగా జగన్ అన్నారు. అనంతరం సీఎం జగన్‌కు తమిళనాడు మంత్రుల బృందం ధన్యవాదాలు తెలిపింది. జగన్‌ను కలిసిన మంత్రులలో గణేశన్, జయకుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ మనివాసన్ ఉన్నారు.