ఆ ఒక్కటి తప్ప.. ప్యాకేజీకి రెడీ

| Edited By: Pardhasaradhi Peri

Jun 27, 2019 | 2:53 PM

ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని బీజేపీ నేత పురందేశ్వరి మరోసారి నొక్కి చెప్పారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు. ప్రత్యేక హోదా పేరుతో ప్రజలను జగన్ పక్కదోవ పట్టించరాదని హితవు పలికారు. అనధికారిక కట్టడాలను ఎవరైనా కూల్చివేయాల్సిందేనని చెప్పిన పురందేశ్వరి.. ప్రజావేదికను కూల్చివేయకుండా ప్రజల అవసరాల కోసం వినియోగించి ఉంటే బావుండేదని ఆమె అభిప్రాయపడ్డారు. చంద్రబాబు హయాంలో అంతులేని అవినీతి జరిగిందని.. అందుకే ప్రజలు టీడీపీని తిరస్కరించారని ఆమె […]

ఆ ఒక్కటి తప్ప.. ప్యాకేజీకి రెడీ
Follow us on

ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని బీజేపీ నేత పురందేశ్వరి మరోసారి నొక్కి చెప్పారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు. ప్రత్యేక హోదా పేరుతో ప్రజలను జగన్ పక్కదోవ పట్టించరాదని హితవు పలికారు. అనధికారిక కట్టడాలను ఎవరైనా కూల్చివేయాల్సిందేనని చెప్పిన పురందేశ్వరి.. ప్రజావేదికను కూల్చివేయకుండా ప్రజల అవసరాల కోసం వినియోగించి ఉంటే బావుండేదని ఆమె అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు హయాంలో అంతులేని అవినీతి జరిగిందని.. అందుకే ప్రజలు టీడీపీని తిరస్కరించారని ఆమె పేర్కొన్నారు. మోదీ రెండోసారి ప్రధాని అవ్వకుండా విపక్షాలన్నీ కుట్రలకు పాల్పాడ్డాయని.. బీజేపీ మరోసారి అధికారంలోకి రాదని చంద్రబాబు దుష్ర్పచారం చేశారని మండిపడ్డారు. అయినా ప్రజలు మోదీని నమ్మి.. మరోసారి ఆయనకే పట్టం కట్టారని చెప్పుకొచ్చారు.