శివసేన – బీజేపీ సీట్ల పంపకంపై నేడు స్పష్టత వచ్చే అవకాశం

| Edited By: Ram Naramaneni

Oct 18, 2020 | 10:25 PM

ముంబై : లోక్‌సభ ఎన్నికల్లో పొత్తుపై బీజేపీ- శివసేన నేడు ఇరు పార్టీల అధ్యక్షులు నేడు ప్రకటన చేస్తారని శివసేన నేత సంజయ్‌ రవుత్‌ చెప్పారు. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాక్రే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించనున్నారని ఆయన తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో సీట్ల సర్దుబాటు విషయంలో ఇరు పార్టీల మధ్య హాట్ హాట్ గా చర్చలు జరిగాయి. కేవలం లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటే కాకుండా మహారాష్ట్ర శాసనసభ […]

శివసేన - బీజేపీ సీట్ల పంపకంపై నేడు స్పష్టత వచ్చే అవకాశం
Follow us on

ముంబై : లోక్‌సభ ఎన్నికల్లో పొత్తుపై బీజేపీ- శివసేన నేడు ఇరు పార్టీల అధ్యక్షులు నేడు ప్రకటన చేస్తారని శివసేన నేత సంజయ్‌ రవుత్‌ చెప్పారు. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాక్రే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించనున్నారని ఆయన తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో సీట్ల సర్దుబాటు విషయంలో ఇరు పార్టీల మధ్య హాట్ హాట్ గా చర్చలు జరిగాయి. కేవలం లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటే కాకుండా మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కూడా సీట్ల సర్దుబాటుపై శివసేన గట్టి పట్టుపడుతోంది. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి గెలిస్తే ముఖ్యమంత్రి పదవి తమకు ఇవ్వాలని శివసేన డిమాండ్‌ చేస్తోంది.