మొదటి ధర్నా.. టీడీపీ ఫెయిల్ అయిందా..!

| Edited By: Srinu

Aug 31, 2019 | 2:50 PM

ఏ రాష్ట్రమైనా, దేశమైనా అధికారపక్షంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సర్వ సాదారణంగా జరిగేదే. ఇక ఇన్నిరోజులు ఏపీలో అధికార వైసీపీపై విమర్శలు మాత్రమే చేసిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మొదటి సారిగా ధర్నా చేసింది. రాష్ట్రంలో ఇసుక కొరతకు ప్రభుత్వ విధానమే కారణమని రాష్ట్రంలోని పలుచోట్ల వారు ఆందోళన చేపట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు చాలామంది కీలక నేతలు ఈ ధర్నాకు దూరంగా ఉన్నా.. నారా లోకేష్, బోండా ఉమ, చింతమనేని వంటి వారు […]

మొదటి ధర్నా.. టీడీపీ ఫెయిల్ అయిందా..!
Follow us on

ఏ రాష్ట్రమైనా, దేశమైనా అధికారపక్షంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సర్వ సాదారణంగా జరిగేదే. ఇక ఇన్నిరోజులు ఏపీలో అధికార వైసీపీపై విమర్శలు మాత్రమే చేసిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మొదటి సారిగా ధర్నా చేసింది. రాష్ట్రంలో ఇసుక కొరతకు ప్రభుత్వ విధానమే కారణమని రాష్ట్రంలోని పలుచోట్ల వారు ఆందోళన చేపట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు చాలామంది కీలక నేతలు ఈ ధర్నాకు దూరంగా ఉన్నా.. నారా లోకేష్, బోండా ఉమ, చింతమనేని వంటి వారు ఈ ధర్నాలో పాల్గొన్నారు. అయితే వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.

ఇదంతా పక్కనపెడితే టీడీపీ చేపట్టిన మొదటి ధర్నా పేలిపోయిందన్న విశ్లేషకుల మాట. టీడీపీ కీలక నేతలు ఇందులో పాల్గొనకపోవడం ఒక మైనస్ అయితే.. ప్రజలు కూడా ఈ ధర్నాకు పెద్దగా స్పందించలేదు. అంతేకాకుండా ఇసుక మాఫియా పుట్టుకొచ్చింది టీడీపీ హయాంలోనే అన్నది ప్రజలకు బాగా తెలుసని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని తీసుకురానుంది. ఇందుకోసం సెప్టెంబర్ 5న ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. అలాంటి నేపథ్యంలో తొందరపడి టీడీపీ ధర్నా చేసిందని.. దీని వలన ఆ పార్టీకే నష్టం తప్ప.. ప్రభుత్వంపై ప్రజలకు నెగిటివ్‌ను క్రియేట్ చేయలేకపోయిందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.