టీడీపీలోకి వెళ్తా.. లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా

| Edited By: Srinu

Mar 06, 2019 | 8:11 PM

ప్రస్తుతం తన ముందు రెండు దారులున్నాయని.. ఒకటి టీడీపీలోకి వెళ్లడం, లేదంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవడమని మాజీ మంత్రి సబ్బం మరి అన్నారు. గత కొంత కాలంగా టీడీపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్న సబ్బం హరి తన రాజకీయ భవితవ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ అసత్య ప్రచారం చేస్తున్నారని సబ్బం మండిపడ్డారు. రాష్ట్రాల నుంచి కేంద్రానికి డబ్బులు వెళ్తాయని, అంతేకాని ప్రధాని నరేంద్ర మోదీ ఆయన తాతలు సంపాదించిన ఆస్తిని […]

టీడీపీలోకి వెళ్తా.. లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా
Follow us on

ప్రస్తుతం తన ముందు రెండు దారులున్నాయని.. ఒకటి టీడీపీలోకి వెళ్లడం, లేదంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవడమని మాజీ మంత్రి సబ్బం మరి అన్నారు. గత కొంత కాలంగా టీడీపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్న సబ్బం హరి తన రాజకీయ భవితవ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

పోలవరంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ అసత్య ప్రచారం చేస్తున్నారని సబ్బం మండిపడ్డారు. రాష్ట్రాల నుంచి కేంద్రానికి డబ్బులు వెళ్తాయని, అంతేకాని ప్రధాని నరేంద్ర మోదీ ఆయన తాతలు సంపాదించిన ఆస్తిని ఇవ్వడం లేదన్నారు. పోలవరం విషయంలో కేంద్రం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు. ప్రభుత్వపరంగా రాజధానికి అవసరమైనదంతా చంద్రబాబు చేస్తున్నారని సబ్బం హరి ప్రశంసలు కురిపించారు.