నాన్నగారు ఇక్కడే ఉంటారు..! ఎవరికో ఎందుకు భయపడాలి..!

| Edited By:

Jul 04, 2019 | 12:32 PM

మంగళగిరి టీడీపీ ఆఫీసులో మాజీ మంత్రి నారా లోకేష్ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమరావతి నిర్మాణమే పెద్దస్కామ్‌ అని సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రకటించడంతో అభివృద్ధి కుంటుపడుతుందని పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చే పెట్టుబడి దారులు భవిష్యత్తులో రాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. రాజధాని రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని.. ఉద్యమబాట పడతామని హెచ్చరించారు. కాగా.. ఉండవల్లి నివాసంలోనే మాజీ సీఎం చంద్రబాబు ఉంటారని.. ఆయన ఖాళీ చేసి వెళ్లరని లోకేష్ స్పష్టం చేశారు. […]

నాన్నగారు ఇక్కడే ఉంటారు..! ఎవరికో ఎందుకు భయపడాలి..!
Follow us on

మంగళగిరి టీడీపీ ఆఫీసులో మాజీ మంత్రి నారా లోకేష్ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమరావతి నిర్మాణమే పెద్దస్కామ్‌ అని సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రకటించడంతో అభివృద్ధి కుంటుపడుతుందని పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చే పెట్టుబడి దారులు భవిష్యత్తులో రాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. రాజధాని రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని.. ఉద్యమబాట పడతామని హెచ్చరించారు.

కాగా.. ఉండవల్లి నివాసంలోనే మాజీ సీఎం చంద్రబాబు ఉంటారని.. ఆయన ఖాళీ చేసి వెళ్లరని లోకేష్ స్పష్టం చేశారు. ఎవరికో భయపడి వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. చంద్రబాబు ప్రస్తుతం ఉంటున్న నివాసానికి పంచాయతీ అనుమతి ఉందని చెప్పారు. అలాగే.. టీడీపీ నుంచి ఒకరిద్దరు నేతలు బయటకు వెళ్లినా.. నష్టం లేదని ధీమా వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీని ప్రణాళికబద్ధమైన సమీక్షా సమావేశాలతో ముందుకెళతామని అన్నారు నారా లోకేష్.