బీజేపీ నేత పురంధేశ్వరిపై మండిపడ్డారు టీడీపీ ఎంపీ సీఎం రమేష్. పురందేశ్వరి బీజేపీలో ఆమె కొడుకు వైసీపీలో కొనసాగుతున్నారని.. బీజేపీ, వైసీపలో లోపాయకారి ఒప్పందానికి ఇదే నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో టీడీపీని ఓడించడానికి ఆ రెండు పార్టీలు ఎన్నో కుట్రలు పన్నుతున్నాయన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీని వైసీపీ ఎందుకని నిలదీయడం లేదని ప్రశ్నించారు సీఎం రమేష్. బీజేపీ వైసీపీ ముసుగుతీసి ఒకే వేదికపై ప్రచారం చేస్తే బాగుంటుందన్నారు. మోడీ విశాఖ పర్యటనలో ప్రజలు పాల్గొనకుండా నిరసన తెలపాలన్నారు రమేష్.