పార్టీలు మారుతున్న నేతల తీరుపై స్పందించిన ఎంపీ కంభంపాటి

| Edited By: Srinu

Mar 06, 2019 | 8:39 PM

ఆంధ్రప్రదేశ్ లో పార్టీలు మారుతున్న నేతల తీరుపై స్పందించారు విశాఖ బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు. ఒకసారి ఎమ్మెల్యే లేదా ఎంపీ అయిన నేత.. జీవితాంతం అదే పదవుల్లో కొనసాగాలన్న కోరిక ఉండటం సహజమన్నారు. పదవుల కోసం అవసరాన్ని బట్టి రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారని తనదైన స్టైల్లో చెప్పారు. విశాఖ రైల్వేషన్లో ప్రయాణికుల ఏసీ విశ్రాంతి లాంజ్ తో పాటు గాంధీ దామ్ కింద అధునాతన హంగులతో రూపొందించిన రైలు బోగీలను ప్రారంభించారు ఎంపీ హరిబాబు. మార్చి […]

పార్టీలు మారుతున్న నేతల తీరుపై స్పందించిన ఎంపీ కంభంపాటి
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో పార్టీలు మారుతున్న నేతల తీరుపై స్పందించారు విశాఖ బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు. ఒకసారి ఎమ్మెల్యే లేదా ఎంపీ అయిన నేత.. జీవితాంతం అదే పదవుల్లో కొనసాగాలన్న కోరిక ఉండటం సహజమన్నారు. పదవుల కోసం అవసరాన్ని బట్టి రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారని తనదైన స్టైల్లో చెప్పారు. విశాఖ రైల్వేషన్లో ప్రయాణికుల ఏసీ విశ్రాంతి లాంజ్ తో పాటు గాంధీ దామ్ కింద అధునాతన హంగులతో రూపొందించిన రైలు బోగీలను ప్రారంభించారు ఎంపీ హరిబాబు. మార్చి ఒకటిన విశాఖలోని రైల్వే గ్రౌండ్ లో ప్రధాని మోడీ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారాయన.