ఎంపీ గల్లా జయదేవ్.. కృష్ణా జిల్లాలోని లంక గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అక్కడి ప్రజలు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని.. దీన్ని పట్టించుకోని ఆయన.. అమెరికాలో హాయిగా పర్యటనలు చేస్తున్నారని ట్విట్టర్లో ట్వీట్ చేశారు ఎంపీ గల్లా జయదేవ్.
‘వర్షాలు లేకుండా ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి వరదలు చూడలేదని.. అక్కడి ప్రజలు వాపోయారని అన్నారు. మహారాష్ట్ర , కర్నాటక రాష్ట్రాలనుంచి ముందు సమాచారం వచ్చినా.. జగన్ ప్రభుత్వం.. సరైన చర్యలు తీసుకోకుండా ఒకేసారి డ్యామ్ గేట్స్ ఓపెన్ చెయ్యటం వల్లనే ఇంత అనర్థం చోటుచేసుకుందని.. దీన్ని ప్రభుత్వ నిర్లక్ష్యమనలా? ప్రభుత్వ అసమర్థత? అనాలా’ అంటూ ప్రశ్నించారు ఎంపీ గల్లా జయదేవ్.
నేను దూరప్రాంతాలైన లంక వసూలుతో మాట్లాడినపుడు వర్షాలు లేకుండా ఇంతవరుకు ఎప్పుడు ఇలాంటి వరదలు చూడలేదని వాపుతున్నారు. మహారాష్ట్ర , కర్నాటక రాష్ట్రాలనుంచి ముందు సమాచారం వచ్చినా సరైన చర్యలు తీసుకోకుండా ఒకేసరి డాం గేట్స్ ఓపెన్ చెయ్యటం అంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమనలా? ప్రభుత్వ అసమర్థతా? pic.twitter.com/k16ByUhdJE
— Jay Galla (@JayGalla) August 20, 2019