నోరు జారిన రోజా.. బాబును సీఎం అంటూ సంబోధం

| Edited By:

Aug 26, 2019 | 2:28 PM

నగిరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజా సెల్వమణి నోరు జారారు. ఆడవాళ్ల పుట్టుకను ముఖ్యమంత్రి అవమానిస్తాడంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ప్రమాణ స్వీకారంలో రోజా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతిపక్ష టీడీపీపై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ‘‘కారు షెడ్డులో ఉండాలి. ఆడది ఇంట్లో ఉండాలి అని చెప్పిన పెద్ద మనిషి పరిపాలనలో మహిళలకు ఏం న్యాయం జరిగిందో అందరం చూశాం. ముఖ్యమంత్రి ఉన్నాడు […]

నోరు జారిన రోజా.. బాబును సీఎం అంటూ సంబోధం
Follow us on

నగిరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజా సెల్వమణి నోరు జారారు. ఆడవాళ్ల పుట్టుకను ముఖ్యమంత్రి అవమానిస్తాడంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ప్రమాణ స్వీకారంలో రోజా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతిపక్ష టీడీపీపై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ‘‘కారు షెడ్డులో ఉండాలి. ఆడది ఇంట్లో ఉండాలి అని చెప్పిన పెద్ద మనిషి పరిపాలనలో మహిళలకు ఏం న్యాయం జరిగిందో అందరం చూశాం. ముఖ్యమంత్రి ఉన్నాడు అసలు. ఆడవాళ్ల పుట్టకనే అవమానిస్తాడు’’ అని రోజా వ్యాఖ్యలు చేశారు.

ఇక ఈ వ్యాఖ్యలతో అక్కడున్న అందరూ ఖంగుతిన్నారు. ముఖ్యమంత్రి అంటూ ఆమె ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతుందో అని అందరూ షాక్‌కు గురయ్యారు. అయితే ఆ తరువాత జగన్‌పై ప్రశంసలు కురిపించడంతో ఆమె వ్యాఖ్యలు చంద్రబాబును ఉద్దేశించినవి అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయనపై ఒంటికాలుతో లేచే రోజా.. ఇప్పుడు అదే పంథాను కొనసాగిస్తూ నోరు జారారు.