చిరు భేటీతో.. జగన్‌కు డబుల్ ధమాకా.. అదేంటంటే..!

| Edited By:

Oct 15, 2019 | 9:38 PM

ఆయనో సినీ హీరో.. ఈయనో రియల్ హీరో.. కట్ చేస్తే.. ఇద్దరు కలిశారు. అదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. సోమవారం ఏపీ సీఎం జగన్, ప్రముఖ సినీ నటుడు, కాంగ్రెస్ నేత చిరంజీవి భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే జగన్ అధికారం చేపట్టి నాలుగు నెలలు గడిచింది. అయితే ఇప్పటి వరకు ఆయనను కలవని చిరు.. సడన్‌గా జగన్‌ను కలవడం.. దాదాపు గంటసేపు మీటింగ్ జరగింది. ఇంతకీ ఆ భేటీలో ఏం […]

చిరు భేటీతో.. జగన్‌కు డబుల్ ధమాకా.. అదేంటంటే..!
Follow us on

ఆయనో సినీ హీరో.. ఈయనో రియల్ హీరో.. కట్ చేస్తే.. ఇద్దరు కలిశారు. అదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. సోమవారం ఏపీ సీఎం జగన్, ప్రముఖ సినీ నటుడు, కాంగ్రెస్ నేత చిరంజీవి భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే జగన్ అధికారం చేపట్టి నాలుగు నెలలు గడిచింది. అయితే ఇప్పటి వరకు ఆయనను కలవని చిరు.. సడన్‌గా జగన్‌ను కలవడం.. దాదాపు గంటసేపు మీటింగ్ జరగింది. ఇంతకీ ఆ భేటీలో ఏం జరిగింది? ఇది తెలుగు రాజకీయాల్లో ముఖ్యంగా ఏపీలో నడుస్తున్న చర్చ.

దాదాపు గంటపాటు జరిగిన ఇద్దరి భేటీలో రాజకీయ అంశాలపై ఎలాంటి చర్చ జరగలేదని ప్రచారం జరుగుతున్నా.. సీఎం జగన్ మాత్రం ఈ భేటీని తనకు అనుకూలంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. చిరుతో జరిగిన భేటీలో ఆయన తనకు ఆత్మీయుడిలా చిరు అభిమానులకు సంకేతాలు పంపారు. అదే సమయంలో జనసేనాకి చెక్ పెట్టే వ్యూహాలకు కూడా పదును పెట్టినట్లు తెలుస్తోంది. చిరు తమ్ముడే జనసేనాని కావడం.. మరోవైపు చిరంజీవి సామాజిక వర్గం కాపులను దగ్గరకు చేసుకున్నట్లు సంకేతాలు పంపారు.

అయితే ఇటీవల జరిగిన ఎన్నికల ముందు టీడీపీ.. జనసేనా పార్టీలు ఒక్కటేనంటూ వైసీపీ నేతలు విస్తృత ప్రచారం చేశారు. అదే అంశాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లగలిగారు. అంతేకాదు ఎన్నికల తర్వాత కూడా టీడీపీ కనుసన్నులోనే జనసేన ఉందంటూ ప్రచారం కొనసాగించారు. అయితే ఇప్పుడు చిరంజీవితో మీటింగ్‌ ద్వారా జగన్.. జనసేనానికి ఓ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చిరుకి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా.. అటు జనసేనాకు చెక్ పెట్టడమే కాకుండా.. కోస్తాంధ్రాలో బలమైన కాపు సామాజిక వర్గానికి కూడా దగ్గరయ్యే వ్యూహానికి పదును పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు చిరంజీవి.. జగన్ బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ మీటింగ్ ద్వారా సిగ్నల్స్ ఇవ్వడం ద్వారా.. అటు జనసేనా క్యాడర్ కూడా వైసీపీ వైపు మొగ్గుచూపే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.