రిగ్గింగ్ జరుగుతుందని తెలిసి వెళ్లా: కోడెల

| Edited By:

Apr 11, 2019 | 3:34 PM

సార్వత్రిక ఎన్నికల వేళ ఇనమెట్ల పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్​కు పాల్పడుతున్నారని తెలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లానని శాసససభాపతి కోడెల శివప్రసాద్ తెలిపారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లగానే తనపై దాడి చేయటం మొదలుపెట్టారన్నారు. అధికారులు తలుపులు వేస్తే వాటినీ కూడా పగలగొట్టి తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు దౌర్జన్యాలు చేస్తారని ముందే ఊహించామన్నారు. ఇలా దాడులు చేయటం ఇన్నేళ్లలో మొదటిసారిగా చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తనకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక […]

రిగ్గింగ్ జరుగుతుందని తెలిసి వెళ్లా: కోడెల
Follow us on

సార్వత్రిక ఎన్నికల వేళ ఇనమెట్ల పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్​కు పాల్పడుతున్నారని తెలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లానని శాసససభాపతి కోడెల శివప్రసాద్ తెలిపారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లగానే తనపై దాడి చేయటం మొదలుపెట్టారన్నారు. అధికారులు తలుపులు వేస్తే వాటినీ కూడా పగలగొట్టి తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు దౌర్జన్యాలు చేస్తారని ముందే ఊహించామన్నారు. ఇలా దాడులు చేయటం ఇన్నేళ్లలో మొదటిసారిగా చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తనకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నించారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి చేసే వారికి కాకుండా..దౌర్జన్యాలు చేసే వారికి ఓటు వేేస్తే రాష్ట్రాభివృద్ధికి విఘాతం కలుగుతుందని కోడెల స్పష్టం చేశారు.