జగన్ సంచలన నిర్ణయం.. టీడీపీ ఎమ్మెల్యేలకు నో ఎంట్రీ!

| Edited By: Srinu

Mar 06, 2019 | 9:05 PM

అమరావతి: ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. గెలుపు గాలులు వైసీపీ వైపే వీస్తుండటంతో అధికార టీడీపీలో ఉన్న పలువురు నేతలు పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆమంచి కృష్ణ మోహన్, అవంతి శ్రీనివాస్, దాసరి జై రమేశ్‌, రవీంద్ర బాబులు వైసీపీ కండువాను కప్పుకోగా.. మరికొంతమంది క్యూలో ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓ నిర్ణయం తీసుకున్నారట. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలను తన పార్టీలోకి ఆహ్వానించేందుకు […]

జగన్ సంచలన నిర్ణయం.. టీడీపీ ఎమ్మెల్యేలకు నో ఎంట్రీ!
Follow us on

అమరావతి: ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. గెలుపు గాలులు వైసీపీ వైపే వీస్తుండటంతో అధికార టీడీపీలో ఉన్న పలువురు నేతలు పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆమంచి కృష్ణ మోహన్, అవంతి శ్రీనివాస్, దాసరి జై రమేశ్‌, రవీంద్ర బాబులు వైసీపీ కండువాను కప్పుకోగా.. మరికొంతమంది క్యూలో ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓ నిర్ణయం తీసుకున్నారట. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలను తన పార్టీలోకి ఆహ్వానించేందుకు ఆయన ఆసక్తిని చూపడం లేదట.

టీడీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల తీరుతో ప్రజలు విసిగిపోయారని.. అలాగే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు ఎమ్మెల్యేలను వైసీపీలోకి ఆహ్వానిస్తే అది పార్టీని దెబ్బతీస్తుందని భావించిన జగన్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. దీంతో అలాంటి వారిని పార్టీలోకి తీసుకురావొద్దని జిల్లా నేతలకు గట్టి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీలో చేరాలనుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు డైలామాలో పడ్డట్లు టాక్.