మళ్లీ కాంగ్రెస్‌కు జై కొట్టిన రాజగోపాల్.. పార్టీ మారడంపై యూ టర్న్.. !

| Edited By: Anil kumar poka

Sep 17, 2019 | 7:04 AM

తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయింది. అధికార పార్టీకి ప్రత్యామ్నాయం కేవలం బీజేపీ మాత్రమే. దేశంలో మరో ఇరవై ఏళ్లు బీజేపీదే హవా. కాంగ్రెస్ మరో ఇరవై ఏళ్లైనా కూడా.. కోలుకునే పరిస్థితి లేదు. ఇది అన్నది ఎవరో అర్థమయ్యే ఉంటుంది. అదేనండి మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదే.. ఇక త్వరలో కమలం గూటికి చేరుతానంటూ ప్రకటనలు కూడా చేశారు. అయితే మళ్లీ ఎం అయ్యిందో ఎమో గానీ.. యూ టర్న్ […]

మళ్లీ కాంగ్రెస్‌కు జై కొట్టిన రాజగోపాల్.. పార్టీ మారడంపై యూ టర్న్.. !
Follow us on

తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయింది. అధికార పార్టీకి ప్రత్యామ్నాయం కేవలం బీజేపీ మాత్రమే. దేశంలో మరో ఇరవై ఏళ్లు బీజేపీదే హవా. కాంగ్రెస్ మరో ఇరవై ఏళ్లైనా కూడా.. కోలుకునే పరిస్థితి లేదు. ఇది అన్నది ఎవరో అర్థమయ్యే ఉంటుంది. అదేనండి మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదే.. ఇక త్వరలో కమలం గూటికి చేరుతానంటూ ప్రకటనలు కూడా చేశారు. అయితే మళ్లీ ఎం అయ్యిందో ఎమో గానీ.. యూ టర్న్ తీసుకున్నట్లు అర్థమవుతోంది.

రాష్ట్రంలో అధికార పార్టీని ఎదుర్కోవడం కేవలం బీజేపీతోనే సాధ్యమన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టడం ఖాయమన్నారు. అయితే సోమవారం మాటమార్చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షం లేకుండా చేసినందుకే కేసీఆర్‌ను నియంత అంటున్నామని అన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన నుండి తెలంగాణ విముక్తి కావాలని.. అప్పుడు తెలంగాణ మూడో విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటుందని వ్యాఖ్యానించారు. అంతేకాదు మహాభారతంలో కౌరవులు వంద మంది ఉన్నా.. చివరకు పాండవులే విజయం సాధించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి… కాంగ్రెస్ శాసనసభ్యులను పాండువులతో పోల్చారు.

తమ పార్టీ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్కను శ్రీకృష్ణుడితో పోల్చిన రాజగోపాల్ రెడ్డి… శ్రీధర్ బాబును ధర్మరాజుగా, జగ్గారెడ్డిని భీముడిగా, తనను అర్జునుడిగా, సీతక్క, వీరయ్యను నకుల సహదేవులుగా అభివర్ణించారు. ఇప్పుడు కలియుగ మహాభారతంలో కాంగ్రెస్‌కు పదేళ్లు వనవాస కాలం నడుస్తోందని అన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ను గద్దె దించడమన్నదే నా లక్ష్యమని రాజగోపాల్ రడ్డి అన్నారు. అయితే ఇప్పుడు సడన్‌గా రాజగోపాల్ చేసిన ఈ వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోందన్న దానిపై చర్చ కొనసాగుతోంది. టీపీసీసీ చీఫ్‌పై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయిన రాజగోపాల్.. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే అదే పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీదే విజయం అంటూ వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతం అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే ఉత్తమ్, కుంతియాలను బహిరంగంగానే విమర్శించిన ఆయన.. టీపీసీసీ తన అన్నకి ఇవ్వాలంటూ కోరిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఒకవేళ టీపీసీసీ పదవిపై కోమటిరెడ్డి వెంటకరెడ్డి కన్నేశారా.. అందుకోసమే తమ్ముడితో ఇలా వ్యాఖ్యలు చేయించి ఉంటారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అన్న కోసమే తమ్ముడు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని.. గతంలో రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు. మొత్తానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడంపై యూ టర్న్‌ తీసుకున్నారని అర్థమవుతోంది.