ఏపీ అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిల మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. వైసీపీ, బీజేపీ మిత్రపక్షమని, బీజేపీ అండతోనే వైసీపీ గెలిచిందన్నారు జనసేన ఎమ్మెల్యే రాపాక. అయితే.. ఈ వ్యాఖ్యలను వెంటనే చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఖండించారు. తాము బీజేపీతో కలిసి పోటీ చేయలేదని.. పొత్తు పెట్టుకోలేదని తమని బీజేపీ మిత్రపక్షమని ఎలా అంటారని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.