నాపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారు

| Edited By: Srinu

Apr 10, 2019 | 7:30 PM

తన అడ్వకేట్ వద్ద రూ.10లక్షలు దొరికాయంటూ తనపై బురదజల్లుతున్నారని చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. తాను భారీ మెజారిటీతో గెలుస్తాననే భయంతోనే ఇవన్నీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తన నియోజకవర్గ పరిధిలోని కింది స్థాయి క్యాడర్‌ను కొన్నారని కొండా విమర్శించారు. కాగా ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బులు తరలిస్తున్నారన్న కారణాలతో పలు వాహనాల తనిఖీ […]

నాపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారు
Follow us on

తన అడ్వకేట్ వద్ద రూ.10లక్షలు దొరికాయంటూ తనపై బురదజల్లుతున్నారని చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. తాను భారీ మెజారిటీతో గెలుస్తాననే భయంతోనే ఇవన్నీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తన నియోజకవర్గ పరిధిలోని కింది స్థాయి క్యాడర్‌ను కొన్నారని కొండా విమర్శించారు. కాగా ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బులు తరలిస్తున్నారన్న కారణాలతో పలు వాహనాల తనిఖీ చేసిన పోలీసులకు సందీప్ రెడ్డి కారులో డబ్బుతో పాటు పలు పత్రాలు దొరికిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సందీప్ రెడ్డిని తమ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.