మా కుమారుడు వైసీపీలో ఉంటే తప్పేంటి..?: పురంధేశ్వరి

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:49 PM

నెల్లూరు: తమ కుమారుడు వైసీపీలో ఉంటే తప్పేంటి అంటూ బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన వారు వివిధ పార్టీ్ల్లో ఉంటే తప్పులేనప్పుడు తమ కుటుంబం ఉంటే తప్పేంటని ఆమె ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా పర్యటనలో సందర్భంగా మీ కుటుంబం మొత్తం వైసీపీలో చేరిందిగా.. మీరెప్పుడు చేరుతున్నారు అన్న విలేకరుల ప్రశ్నకు ఆమె ఇలా సమాధానమిచ్చారు. ఏపీలో అభివృద్ధి కేంద్రం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేసిన పురందేశ్వరి.. కేంద్ర […]

మా కుమారుడు వైసీపీలో ఉంటే తప్పేంటి..?: పురంధేశ్వరి
Follow us on

నెల్లూరు: తమ కుమారుడు వైసీపీలో ఉంటే తప్పేంటి అంటూ బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన వారు వివిధ పార్టీ్ల్లో ఉంటే తప్పులేనప్పుడు తమ కుటుంబం ఉంటే తప్పేంటని ఆమె ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా పర్యటనలో సందర్భంగా మీ కుటుంబం మొత్తం వైసీపీలో చేరిందిగా.. మీరెప్పుడు చేరుతున్నారు అన్న విలేకరుల ప్రశ్నకు ఆమె ఇలా సమాధానమిచ్చారు.

ఏపీలో అభివృద్ధి కేంద్రం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేసిన పురందేశ్వరి.. కేంద్ర పథకాలను టీడీపీ ప్రభుత్వం తమవిగా ప్రచారం చేసుకుంటోందని దుయ్యబట్టారు. మోదీని ఎదుర్కొనేందుకు అవినీతి పార్టీలన్నీ ఒకటి అవుతున్నాయని ఆమె విమర్శించారు. మార్చి 1న మోదీ విశాఖపట్నంలో పర్యటించనున్నట్లు ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు.