తారాస్థాయికి చేరిన కాంగ్రెస్ గ్రూప్ పాలిటిక్స్

| Edited By: Srinu

Mar 07, 2019 | 4:40 PM

ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ లో గ్రూప్ పాలిటిక్స్ తారాస్థాయికి చేరాయి. సంబాల్ డీసీసీ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో గొడవ జరిగింది. రెండు వర్గాల మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. రెండు గ్రూపులుగా విడిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. డీసీసీ ప్రెసిడెంట్ వి.మలేశ్ కుమార్ సమక్షంలోనే ఈ దాడి జరిగింది. కార్యకర్తలను సముదాయించడానికి నేతలు నానాతంటాలు పడ్డారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై చర్చించేందుకు కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో […]

తారాస్థాయికి చేరిన కాంగ్రెస్ గ్రూప్ పాలిటిక్స్
Follow us on

ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ లో గ్రూప్ పాలిటిక్స్ తారాస్థాయికి చేరాయి. సంబాల్ డీసీసీ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో గొడవ జరిగింది. రెండు వర్గాల మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. రెండు గ్రూపులుగా విడిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. డీసీసీ ప్రెసిడెంట్ వి.మలేశ్ కుమార్ సమక్షంలోనే ఈ దాడి జరిగింది. కార్యకర్తలను సముదాయించడానికి నేతలు నానాతంటాలు పడ్డారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై చర్చించేందుకు కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వాళ్ల అనుచరులు పరస్పరం దాడులు చేసుకున్నారు.