వరుస సమీక్షలతో బిజీబిగా గడుపుతున్న ఏపీ సీఎం జగన్ వ్యవసాయ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీ అగ్రికల్చర్ మిషన్పై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టారు. రైతు సమ్యలు, పంట రుణాలు, విత్తనాల సరఫరాపై ప్రధానంగా చర్చిస్తున్నారు. దీంతో పాటు కేంద్ర బడ్జెట్పై కూడా అధికారులతో చర్చిస్తారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబుతో పాటు ఆ శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం అగ్రికల్చర్ మిషన్పై ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.