కేటీఆర్‌‌కు బాబు కౌంటర్

| Edited By: Srinu

Mar 06, 2019 | 8:00 PM

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఎన్నికల్లో టీడీపీ వంద శాతం ఓడిపోతుందని తెలంగాణ రాష్ట్ర సమితి కె.తారకరామారావు అన్న వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆదివారం మధ్యాహ్నం పలువురు ముఖ్యనేతలకు టీడీపీ కండువా కప్పిన అనంతరం ఆయన మాట్లాడారు. జగన్‌ సీఎం అవుతాడని కేటీఆర్‌ అంటున్నారని, మోదీ, కేసీఆర్‌, జగన్‌ కుట్రలు ఆంధ్రప్రదేశ్‌లో సాగవని ఆయన హెచ్చరించారు. వాళ్లకు చేతనైతే అభివృద్ధిలో తనతో పోటీ పడాలని సవాల్ విసిరారు. తెలంగాణలో కేసీఆర్‌ ఏం అభివృద్ధి చేశారని ఆయన […]

కేటీఆర్‌‌కు బాబు కౌంటర్
Follow us on

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఎన్నికల్లో టీడీపీ వంద శాతం ఓడిపోతుందని తెలంగాణ రాష్ట్ర సమితి కె.తారకరామారావు అన్న వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆదివారం మధ్యాహ్నం పలువురు ముఖ్యనేతలకు టీడీపీ కండువా కప్పిన అనంతరం ఆయన మాట్లాడారు. జగన్‌ సీఎం అవుతాడని కేటీఆర్‌ అంటున్నారని, మోదీ, కేసీఆర్‌, జగన్‌ కుట్రలు ఆంధ్రప్రదేశ్‌లో సాగవని ఆయన హెచ్చరించారు. వాళ్లకు చేతనైతే అభివృద్ధిలో తనతో పోటీ పడాలని సవాల్ విసిరారు. తెలంగాణలో కేసీఆర్‌ ఏం అభివృద్ధి చేశారని ఆయన ప్రశ్నించారు. రాజధానిలో అభివృద్ధి ఏమీ లేదు.. అంతా గ్రాఫిక్స్‌ అంటున్నారని, ముందు గ్రాఫిక్స్‌ వచ్చిన తర్వాతే భవనాలు వస్తాయని చంద్రబాబు గుర్తు చేశారు. ఏపీని ప్రశాంత్‌ కిషోర్‌ మరో బిహార్‌ చేయాలని చూస్తున్నారని, జగన్‌, పీకే కుప్పిగంతులు తన దగ్గర పనిచేయవని ఆయన అన్నారు.