అలాంటి వ్యక్తి.. నీతిపన్నాలు ప్రబోధిస్తున్నారు: మోదీకి బాబు చురక

| Edited By:

May 11, 2019 | 11:15 AM

రాజకీయ లాభం కోసం ఎప్పుడో చనిపోయిన నాయకులను, చివరికి కుటుంబ సభ్యులను కించపరిచేందుకు కూడా నరేంద్ర మోదీ వెనుకాడరని సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. మోదీ రక్షణ శాఖను, సైన్యాన్నీ వాడుకుంటారని.. మతాల మధ్య చిచ్చు పెట్టి, రాజకీయ నాయకత్వాన్ని చంపేస్తారని కామెంట్లు చేశారు. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న వ్యక్తి తమకు నీతిపన్నాలు ప్రబోధిస్తారని బాబు ఎద్దేవా చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ట్వీట్ చేశారు. మే 23న దేశ ప్రజలు ప్రధానిగా […]

అలాంటి వ్యక్తి.. నీతిపన్నాలు ప్రబోధిస్తున్నారు: మోదీకి బాబు చురక
Follow us on

రాజకీయ లాభం కోసం ఎప్పుడో చనిపోయిన నాయకులను, చివరికి కుటుంబ సభ్యులను కించపరిచేందుకు కూడా నరేంద్ర మోదీ వెనుకాడరని సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. మోదీ రక్షణ శాఖను, సైన్యాన్నీ వాడుకుంటారని.. మతాల మధ్య చిచ్చు పెట్టి, రాజకీయ నాయకత్వాన్ని చంపేస్తారని కామెంట్లు చేశారు. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న వ్యక్తి తమకు నీతిపన్నాలు ప్రబోధిస్తారని బాబు ఎద్దేవా చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ట్వీట్ చేశారు.

మే 23న దేశ ప్రజలు ప్రధానిగా మోదీని, అతడి టీమ్‌ను తిరస్కరించడం ఖాయమని.. అంపైర్లు లేకుండా చేసి, రిఫరీ సిస్టమ్‌నే ధ్వంసం చేసేలా వ్యవహరిస్తున్న మోదీ టీమ్‌కు పరాజయం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. నిబంధనల ప్రకారం సక్రమంగా ఆడే కొత్త టీమ్‌ను ప్రజలే ఎంపిక చేసుకుంటారని.. ప్రజాస్వామాన్ని కాపాడుకుంటారని చంద్రబాబు పేర్కొన్నారు.