జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాకు మసాలా లాంటి వాడు అని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు క్యాడర్ బలంగా ఉందని.. ఆ క్యాడర్కు పవన్ మసాలా, ఫ్లేవర్ అని ఆయన అన్నారు. పవన్కు ఇప్పుడు అంత బలంగా కేడర్ లేదని, ఆయనకు బీజేపీ కేడర్ ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. రెండు చేతులు కలిస్తే చప్పట్లు ఎలా వస్తాయో.. అలాగే ఇద్దరం కలిసి పనిచేస్తే దాని వలన మేలు తప్ప నష్టం ఉండదని ఆయన పేర్కొన్నారు. కర్నూల్లో హైకోర్టు ఏర్పాటుకు మొదటి నుంచి బీజేపీ మద్దతు తెలుపుతోందని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ భావాలకు అనుకూలంగా ఉన్నంతకాలం వైసీపీకి మద్దతు ఉంటుందని వెల్లడించారు.
Read This Story Also: డీజీపీ ఆఫీస్ ముందు చంద్రబాబు నిరసన..!